సిద్దిపేట రూరల్, జనవరి 25: తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయని వివిధ రాష్ర్టాల అధికారులు ప్రశంసించారు. బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్కు చెందిన 30 మంది అధికారులతో కూడిన బృందం బుధవారం ఎన్ఐఆర్డీ నుంచి సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడు గ్రామానికి వచ్చింది. హరితహారం, డంపింగ్యార్డు, మిషన్ భగీరథ, గొర్రెల పథకం, డబుల్ బెడ్రూం ఇండ్లు తదితర అంశాలను బృందం సభ్యులు పరిశీలించారు. గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
డంపింగ్యార్డును పరిశీలించారు. మొక్కల పెంపకంపై ఆరా తీశారు. సేంద్రియ పద్ధతిలో సాగు విధానానికి వినియోగించే ఎరువు తయారీ బాగున్నదని, ఇందుకు ఉపయోగిస్తున్న క్యూఆర్కోడ్ విధానాన్ని వారు మెచ్చుకున్నారు. గ్రామ శివారులోని సామూహిక గొర్రెల షెడ్డును పరిశీలించారు. గ్రామంలో నిర్వహిస్తున్న మన సిద్దిపేట – మాంసం ఉత్పత్తులపై అధికారులు ఆసక్తిచూపారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం బాగున్నదని ప్రశంసించారు.