నిజామాబాద్ : పునరుజ్జీవ పథకంలో భాగంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి జూలై ఏడో తారీఖున మొదలైన కాళేశ్వరం జలాల ఎత్తిపోత తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయాన్ని అధికారికంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. SRSP ప్రాజెక్టులోకి నీటిమట్టం 30 టీఎంసీలకు చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. కాగా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి పది రోజుల్లో పది టీఎంసీ నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇందులో మూడు టీఎంసీలు కాలేశ్వరం జలాలు ఉండగా..మిగిలినవి గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి వస్తున్న వరదగా నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.