రాష్ట్రపతి ఎన్నికల బ్యాలెట్ బాక్సును అధికారులు ఢిల్లీకి తరలించారు. దేశవ్యాప్తంగా సోమవారం నాడు రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఎన్నికలు జరిగాయి. సీఎం కేసీఆర్ సహా దాదాపు నేతలంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికల బ్యాలెట్ బాక్సును సాయంత్రం అసెంబ్లీలోని లాకర్ రూంలోనే జాగ్రత్త చేసిన అధికారులు.. తెల్లారగానే వాటిని ఢిల్లీ తరలించారు. ఎన్నికల అధికారులు ఈ బాక్సును తీసుకొని ఢిల్లీ బయలుదేరినట్లు తెలుస్తోంది.