BJP | నిర్మల్ టౌన్, ఆగస్టు 23: నిర్మల్ జిల్లాలో బీజేపీకి మరో షాక్ తగిలింది. బీజేపీకి చెందిన ఓబీసీ నేత, తెలంగాణ గౌడజనుల హక్కుల రాష్ట్ర అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
సీఎం కేసీఆర్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మెచ్చి బీజేపీకి రాజీనామా చేసినట్టు ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆయన మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిని కలిసి ఈనెల 27న బీఆర్ఎస్లో చేరనున్నట్టు ప్రకటించారు.