River Linking | హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రతిపాదనపై పరివాహక రాష్ట్రాల అభ్యంతరాలను పట్టించుకోకుండానే కేంద్రం ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటున్నది. ఆది నుంచీ రాష్ట్రాల అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ గత సమావేశాల్లో రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలకు ఎలాంటి జవాబు ఇవ్వకుండానే నదుల అనుసంధానానికి ఒప్పందం చేసుకోవాలం టూ హడావుడి చేస్తున్నది.
జూలై 11న నిర్వహించనున్న 71వ పాలక మండలి సమావేశ అజెండాలో ఈ అంశాన్ని చేర్చింది. ఏపీ, ఛత్తీస్గఢ్, తెలంగాణతోపాటు ఇతర పరివాహక రాష్ర్టాలకు లేఖలు రాసింది. మరోవైపు ఎన్డబ్ల్యూడీఏ తీరుపై అన్ని రాష్ర్టాల నీటిపారుదలశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.