హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): దెబ్బ తగిలినా, కత్తి కోసుకుపోయినా వెంటనే ప్రథమ చికిత్సగా గుర్తొచ్చేది పసుపు. ఇది గొప్ప యాంటి సెప్టిక్గా పనిచేస్తుంది. కరోనా సమయంలో పసుపు చేసిన మేలుకు ప్రపంచం ఫిదా అయ్యింది. అయితే, యాంటి సెప్టిక్గానే కాదు.. జ్ఞాపకశక్తి పెంచటంలోనూ పసుపు మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.
అభిజ్ఞా శక్తిని పెంపొందించటంలో ఇది సాయపడుతుందని అంటున్నారు. మార్కెట్లో దొరికే కొన్ని రకాల బ్రాండ్ల పసుపు కల్తీ ఉంటున్నదని, దాన్ని గుర్తించకపోతే దీర్ఘకాలంలో అనేక రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. పసుపులో ఉండే కర్కుమిన్తో దాని నాణ్యతను పరీక్షించవచ్చని వివరించారు.