హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): ఖమ్మం నగరంలోని లకారం చెరువు మధ్యలో ఈ నెల 28న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. తానా సహకారంతో విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని భారత యాదవ సమితి, ఇతరులు వేసిన పిటిషన్లను జస్టిస్ కే లక్ష్మణ్ గురువారం విచారణ చేపట్టారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, నిర్వాహకులను ఆదేశించిన హైకోర్టు విచారణను జూన్ 6కు వాయిదా వేసింది.