హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రామగుండం నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఎన్టీపీసీ) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీటిపై తేలియాడే 100 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు పనులు జోరందకున్నాయి. ఈ నెలాఖరునాటికి 15 మెగావాట్లను గ్రిడ్తో అనుసంధానించాలన్నది లక్ష్యం. ఆపై విడతలవారీగా ప్రతినెలా 10-15 మెగావాట్ల చొప్పున గ్రిడ్తో అనుసంధానించనున్నారు. రామగుండంలోని ఎన్టీపీసీ రిజర్వాయర్లో తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టును సుమారు 450 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్టు ఎన్టీపీసీ సీజీఎం సునీల్కుమార్ తెలిపారు.