ఎన్నారై ప్రతినిధి జయ్శేఖర్ తాళ్లూరి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి ఎంతో మంచి కార్యక్రమమని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షుడు, ఎన్నారై ప్రతినిధి జయశేఖర్ తాళ్లూరి అభినందించారు. ఈ పథకానికి తనవంతుగా రూ.25 లక్షల సాయం చేస్తానని చెప్పారు. ఎన్నారైలను భాగస్వాములను చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన జయశేఖర్ తాళ్లూరి ఎన్నారై వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఐటీ, హెల్త్కేర్ తరితర రంగాల్లో పారిశ్రామికవేత్తగా ఎదిగారు. గతంలోనూ ఆయన అమెరికాలో తెలుగు బోధనను ప్రోత్సహించడానికి అక్కడి పాఠశాలలకు కోటిన్నర విరాళంగా ఇచ్చారు.