హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో వీసీ (వైస్ చాన్సలర్ల)ల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్లోని ఉస్మానియా, పొట్టి శ్రీరాములు (తెలుగు), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (దూర), జవహర్లాల్ నెహ్రూ (టెక్నాలజీ), వరంగల్ కాకతీయ, నల్లగొండ మహాత్మాగాంధీ, కరీంనగర్ శాతవాహన, నిజామాబాద్ తెలంగాణ, మహబూబ్నగర్ పాలమూరు, హైదరాబాద్లోని జవహర్లాల్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ (జేఎన్ఏఎఫ్ఏయూ) విశ్వవిద్యాలయాల వీసీల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. వివరాలకు www.tsche.ac.in వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొన్నది.