ఘట్కేసర్,మే6:కొత్తగా ఏర్పాటైన నగర శివారు ము న్సిపాలిటీలను సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. గురువారం పోచారం మున్సిపాలిటీ పాలకవర్గం సమావేశం చైర్మన్ కొండల్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడుతూ.. శివారు మున్సిపాలిటీల్లో ప్రజలకు పూర్తిస్థాయి లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. తాగునీరు, రోడ్లు, వైకుంఠధామాల అభివృద్ధి, పచ్చదనం, ఆరోగ్యం, విద్య, మురుగునీటి పారుదలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. ప్రజాప్రతినిధులు ఒక్కటిగా ఉండి, ప్రజలకు కావాల్సిన సదుపాయాలను కల్పించాలని సూచించారు.
పోచారం మున్సిపాలిటీ ప్రజలకు అవసరమైన పలు అభివృద్ధి కార్యక్రమాలను చేసేందుకు మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి రూ.5 కోట్ల2లక్షల50వేలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాలకవర్గం సభ్యులు సమావేశంలో తీర్మానించారు. గ్రీన్బడ్జెట్ కింద రూ.64. 50 లక్షలు, ఎల్ఆర్ఎస్ నిధులు రూ.10 లక్షలు, పట్టణ ప్రగతి నిధులు రూ.37.10 లక్షలు, 15వ ఆర్థికసంఘం నిధుల కింద రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్కింద విడుదల చేయనున్న రూ.3కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మా ణం, వైకుంఠధామాల అభివృద్ధికి పాలకవర్గం ఆమోదం తెలిపింది. కొవిడ్ నివారణ చర్యలు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో చేపట్టాలని పాలకవర్గం తీర్మానించింది. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రెడ్యానాయక్, కమిషనర్ సురేశ్, కౌన్సిలర్లు మహేశ్, ధనలక్ష్మి, రాజశేఖర్, సాయిరెడ్డి, శైలజ, హిమ, బాల్రెడ్డి, వెంకటేశ్గౌడ్, లక్ష్మి, హరిప్రసాద్, శ్రీలత, రవీందర్, సరిత, పోచమ్మ, సుధాలక్ష్మి, మమతారాణి, మేనేజర్ నర్సింహులు అధికారులు పాల్గొన్నారు.
ఘట్కేసర్,మే 6: ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజాప్రతినిధులు శ్రద్ధ వహించాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో మున్సిపాలిటీ నిధులు రూ.7లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లుతాగునీటి సౌకర్యం, ఆరోగ్యం, పరిశుభ్ర త, పచ్చదనం, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు.
అంతకు ముందు మంత్రి మల్లారెడ్డి ఘట్కేసర్ మున్సిపాలిటీలోని శివారెడ్డిగూడలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డికి చెందిన కార్యాలయాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సుధీర్రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్చంద్రారెడ్డి, ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ పావనీజంగయ్య యాదవ్, ఎంపీపీ సుదర్శన్రెడ్డి, రైతు సొసైటీ ఉపాధ్యక్షుడు అనంతరెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ప్రధానకార్యదర్శ రాధాకృష్ణ ముదిరాజ్, నాయకులు రాంరెడ్డి, నర్సింహారెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మేడ్చల్ కలెక్టరేట్, మే 6 : సీఎం కేసీఆర్తోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడ 4వ వార్డులో రూ.11 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్వామి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ ప్రధానకార్యదర్శి హరిగౌడ్, కౌన్సిలర్లు వెంకటేశ్, రమేశ్గౌడ్, పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి రాము లు, నాయకులు శ్రీనివాస్గౌడ్, కనకయ్య, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
శామీర్పేట, మే 6: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఆ దిశగా కరోనా నివారణ చర్యలను యుద్ధ ప్రతిపాదికన నిర్వహిస్తుందని మంత్రి మల్లారెడ్డి అన్నారు.జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గురువారం ధన్ఎస్వీ దవాఖాన ఏర్పాటు చేసిన నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభిం చారు. కార్యక్రమంలో మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ శ్రీని వాస్, కార్పొరే టర్లు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.