నారాయణపేట, ఏప్రిల్ 12 : సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయని ఓ రైస్మిల్ యజమానిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ధన్వాడ మండలం కొండాపూర్లోని సాయికృష్ణ రైస్మిల్ను ఇటీవలే కలెక్టర్ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రైస్మిల్ యజమాని రాజేందర్ రెడ్డి ప్రభుత్వానికి అందజేయాల్సిన రూ.1.80 కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యాన్ని పక్కదారి పట్టించినట్టు గుర్తించారు. ధన్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయిం చడంతో పోలీసులు నాన్బెయిలబుల్ కేసు నమోదు చేశారు.