హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుటుంబసభ్యులతో సహా ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన సోమవారం మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి ప్రగతిభవన్కు వెళ్లి సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, టీఆర్ఎస్ ప్రధానకార్యదర్శులు తక్కళ్లపల్లి రవీందర్రావు, సోమా భరత్కుమార్, భగత్ తల్లి లక్ష్మి, భార్య భవాని, కుమారుడు రణజై, కూతురు రేయశ్రీ, మేనమామ సంపత్ తదితరులున్నారు.
సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, వైస్చైర్మన్ జంగిటి కనకరాజు కుటుంబసభ్యులు మంత్రి హరీశ్రావుతో కలిసి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆశీర్వాదం తీసుకున్నారు.