హైదరాబాద్, మే 2 (నస్తే తెలంగాణ) : వడదెబ్బతో ఏడుగురు మృతి చెందినట్టు పత్రికలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, వారు వివిధ కారణాలతో చనిపోయినట్టు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది.
వికారాబాద్ జిల్లాలో 1న మృతి చెందిన ఉపాధ్యాయురాలు రాణి (45), ఆదిలాబాద్ జిల్లాలో ఆత్రం జంగు (46), కరీంనగర్ జిల్లాలో ఆర్ నర్సయ్య (46) గుండెపోటుతో మృతిచెందారని, రంగారెడ్డి జిల్లా కందుకూరులో చనిపోయిన 65 ఏండ్ల గుర్తుతెలియని వ్యక్తి మద్యం అలవాటుతో తలెత్తిన ఆరోగ్య సమస్యలతో, కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఇతర కారణాలతో మరో వ్యక్తి మృతి చెందినట్టు తెలిపింది. మృతిచెందిన వ్యక్తుల్లో ఎవరికీ వడదెబ్బ లక్షణాలు లేవని తెలిపింది.