హైదరాబాద్, మార్చి 23(నమస్తే తెలంగాణ): కొడంగల్లో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ సీఎం రేవంత్రెడ్డి అడగడమే ఆలస్యం.. అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. సోమవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ సెక్రటేరియట్లో కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
కొడంగల్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ 50 ఎకరాల భూమి కేటాయిస్తే ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తద్వారా 100 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.