సూర్యాపేట, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ గుర్తుపై గెలిచి రాజగోపాల్రెడ్డి దగా చేశాడని ఆ పార్టీ క్యాడర్… రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్కు అమ్ముడుపోయాడని సాధారణ జనం.. అనవసరంగా ఉపఎన్నిక తెచ్చి ప్రజాధనం వృథా చేస్తున్నారని ఇంకొందరు.. ఇలా అన్ని వర్గాలు ప్రస్తుత మునుగోడు ఉపఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి దూరంగా ఉంటున్నాయి. ఆయన ప్రచారంలో 80 శాతం ప్రాంతాల్లో జనం రావడం లేదు. దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో తీసుకొచ్చినవారితోపాటు స్థానికంగా ఉండే కార్యకర్తలతో నాలుగైదు గంటలు ఉండేలా ‘ఒప్పందం’ కుదుర్చుకొంటున్నారు.
బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఇదే సన్నివేశం కనిపించింది. ఉదయం 10 గంటలకు పట్టణంలో ర్యాలీ ప్రారంభం కాగా, తంగెడుపల్లి మీటింగ్లో జనం లేకపోవడంతో నాలుగు గంటలు ఆలస్యంగా మొదలైంది. ఉదయం 11.30 గంటలకు సమావేశం అని ప్రకటించి చివరకు సాయంత్రం 4 గంటలకు జరిగింది. 200 కార్లలో హైదరాబాద్కు చెందిన నాయకులు, కార్యకర్తలు రాగా, లారీల్లో జనాన్ని తీసుకొచ్చి రోడ్షో చేసి మమ అనిపించారు.