హైదరాబాద్, ఫిబ్రవరి 13 : సర్జికల్ స్ట్రైక్స్ ఆధారాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అడగటంలో తప్పేలేదని, అడిగే హక్కు ఆయనకు ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడిన సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘రాహుల్గాంధీ సర్జికల్ స్ట్రైక్స్కు ఆధారాలు అడగడం తప్పేం కాదు. నేను కూడా ఆధారాలు అడుగుతున్నా. కేంద్రం ముందుకొచ్చి చూపించాలి. ప్రజల్లో పలు అనుమానాలున్నాయి. బీజేపీది తప్పుడు ప్రచారం. ఫాల్స్ ప్రచారం. ప్రజలు ఎందుకు ఆధారాలు అడగకూడదు. ప్రజాస్వామ్యంలో మీరు మోనార్క్ కాదు. రాజు కాదు. రాహుల్గాంధీ కాంగ్రెస్ నేతగా, ఎంపీగా అడిగే హక్కున్నది. దానికి సమాధానమివ్వాలి. అంతేగాని అసభ్యకరంగా మాట్లాడుతారా? అస్సాం ముఖ్యమంత్రి.. రాహుల్గాంధీ పట్ల అసభ్యంగా మాట్లాడిన తీరును మేం ఖండిస్తున్నం. ఎన్నిసాైర్లెనా ఖండిస్తం. నేను కాంగ్రెస్కు సపోర్టు చేస్తలేను. రాహుల్ గాంధీ మీద వేసిన నిందను ఖండిస్తున్నా. నేను నిజాయితీగా, దేశ పౌరుడిగా ఇది పద్ధతి కాదని చెప్తున్నా. ధర్మం కాదు. నువ్వు వెధవ అను.. నువ్వు అసమర్థుడివి అను, నీకు చేతకాదు అను.. అట్ల ఉంటది కానీ ఇదేం పద్ధతండీ. అట్ల మాట్లాడవచ్చునా? దాన్ని సహించడమనేది మన దేశానికే మంచిది కాదు. మన సమాజానికి మంచిది కాదు. నేను సోనియాగాంధీని అవమానించలే. ఎవరినీ అవమానించలే. నాకసలు ఆ భాషే రాదు. నేను కఠినంగా మాట్లాడుత. కాస్త గట్టిగ మాట్లాడి చెప్తా. అంతేకానీ ఈ దుర్మార్గమైన, అసహ్యమైన పదజాలం మాకు రాదు. అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఎవరూ మాట్లాడలేనివి. నా జీవితంలో ఎప్పుడూ మాట్లాడలే. మాట్లాడను.
సర్జికల్ స్ట్రక్స్ క్రెడిట్ ఆర్మీకి, జవాన్లకు దక్కాలి
సర్జికల్ స్ట్రైక్స్ రాజకీయ స్టంట్ అని సగం దేశం నమ్ముతున్నది. ఏదో రాష్ట్రంలో ఎన్నికలు రాంగనే సరిహద్దుల్లో సమస్య సృష్టించడం, దాన్ని పెద్దగా ప్రచారం చేసుకోవడం బీజేపీ స్టంట్. అనుకోకుండా బిపిన్ రావత్ చనిపోతే ఆయన ఫొటోలను ఉత్తరాఖండ్లో బీజేపీ జెం డాలపై ముద్రించి ప్రచారం చేసుకొంటున్నారు. ఇదేం నాన్సెన్స్. దీన్ని ఎలా అర్థం చేసుకోగలం. బీజేపీ కావాలనే సర్జికల్ స్ర్టైక్స్ను వాడుకొంటున్నది. ఇదే అభిప్రా యం దేశమంతటా ఉన్నది. సరిహద్దుల్లో కొట్లాడుతున్నది సైనికులు. త్యాగాలు చేస్తున్నది మరణిస్తున్నది సైనికులు. క్రెడిట్ దక్కితే ఆర్మీకి, జవాన్లకు దక్కాలి. వాళ్లకు సెల్యూట్ చేయాలి. బీజేపీ ఎలా క్రెడిట్ కొట్టేస్తుంది?
ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం అది
రాహుల్ గాంధీ ముత్తాత దేశం కోసం సంవత్సరాల పాటు జైలుకు వెళ్లాడు. దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. వాళ్ల కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగాలు చేసింది. దేశం కోసం పనిచేస్తూ వాళ్ల నానమ్మ ప్రాణాలు కోల్పోయింది. చంపేశారు. వాళ్ళ నాన్నను కూడా చంపేశారు. వాళ్లను పట్టుకొని ఏం మాట్లాడుతడు అస్సాం ముఖ్యమంత్రి? ఇదేనా తరీఖా. ప్రధానమంత్రి ఆయనను శభాష్ అంటడా. బీజేపీ జాతీయ అధ్యక్షుడిని మరోసారి అడుగుతున్న.. నేను బీజేపీని ప్రశ్నిస్తున్నా. ఈ సంస్కారం లేని మాటలను సహించే ప్రసక్తే లేదు. వాళ్లను విడిచిపెట్టేదే లేదు. ఆ యనతో క్షమాపణ చెప్పించండి. ఇలా మాట్లాడటం బీజేపీ సంస్కారమా? ఎంపీని, చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఒక నాయకుడిని పట్టుకొని ఏ తండ్రికి పుట్టినవ్ అని అడగవచ్చునా? ఇంతటి కుసంస్కారం ఉండవచ్చునా? ఇది పద్ధతేనా? ఎంత వరకు కరెక్టు? ఏమనిపిస్తది? ఇది దేశమా? చాలా బాధాకరం. ఈ సంస్కృతిని బీజేపీ ప్రోత్సహిస్తుందా? ‘దేశ్ కే జనతా హోషియార్ హోకే దూద్ కా దూద్ పానీ కా పానీ కర్నా చాహియే. హిందూస్థాన్ ఏక్తా. సమగ్రత, వికాస్కే నయా ఉమర్ సే. నయా దిశామే చల్నా’. అది అత్యవసరం. శాంతిపూర్వకమైన, ప్రేమపూర్వకమైన దేశాన్ని నిర్మించాలి. అందుకు బీజేపీని తరిమికొట్టాలి. అందుకు యువత ముందుకురావాలె. బీజేపీ భ్రమల నుంచి బయటపడాలె. ఎక్కడికి పోతున్నామో ఆలోచించాలె. బీజేపీ కుసంస్కారంతో చేసే పనుల పర్యావసానాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలె.