హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 50 కి.మీ. పరిధిలో తాటి వనాలు లేకపోయినా కల్లు దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. సంబంధిత జీవోపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. కల్తీకల్లు వల్ల 2002-2004 మధ్యకాలంలో 99 మంది మరణించడంతో అప్పటి ప్రభుత్వం కల్లు దుకాణాల మూసివేతకు జీవో జారీ చేసింది.
కానీ, 2014 సెప్టెంబర్లో ఆ జీవోను రద్దుచేసిన తెలంగాణ ప్రభుత్వం.. పూర్వపు విధానంలో కల్లు దుకాణాల ఏర్పాటుకు వీలుకల్పిస్తూ జీవో జారీ చేసింది. ఆ జీవోను కొట్టేయాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై సీజే అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.