నిర్ధారించిన పుణె వైరాలజీ ల్యాబ్
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ సోకలేదని తేలింది. తాము పంపిన శాంపిల్ను పుణెలోని వైరాలజీ ల్యాబ్ విశ్లేషించి మంకీపాక్స్ కాదని నిర్ధారించినట్టు డీపీహెచ్ శ్రీనివాసరావు మంగళవారం చెప్పారు. కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇటీవల కువైట్ నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్లోని ఫీవర్ దవాఖానలో చేర్పించిన సంగతి తెలిసిందే.
ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామ పరిధిలోని ఓ గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన 35 ఏండ్ల యువకుడి చర్మంపై దద్దుర్లు రావడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు వెళ్లాడు. మంకీపాక్స్గా అనుమానించి పూర్తి నిర్ధారణ కోసం హైదరాబాద్లోని ఫీవర్ హాస్పిటల్కు తరలించారు.