హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నెల రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం రాకుండా జాగ్రత్త వహించాలని కోరారు. సోమవారం సచివాలయంలో మున్సిపల్, నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో రాష్ట్రం లో తాగునీటి సరఫరా పరిస్థితిపై సీఎస్ శాంతికుమారి సమీక్షించారు. నిర్వహణ పనులు ఉన్న ప్రాంతాల్లో ట్యాం కర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని తెలిపారు. సరఫరాలో అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్య లు తీసుకోవాలని సీజీఎంలు, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. నాగార్జునసాగర్ నుంచి నీటి పంపింగ్ ఇప్పటికే ప్రారంభమైందని, మే నెలాఖరు వరకు రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి లోటు ఉండదని అధికారులు సీఎస్కు తెలిపారు.