హైకోర్టులో నేడు విచారణ
హైదరాబాద్, ఏప్రిల్ 5 : కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో చేపట్టే నిరసన కార్యక్రమాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ కాకతీయ లారీ ఓనర్స్ అసోసియేషన్ హైకోర్టులో అత్యవసర హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి తన ఇంటి వద్ద విచారణ చేపట్టారు.
తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది సీహెచ్ నరేశ్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, రవాణా వ్యవస్థకు నష్టం జరుగుతోందని, టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలను అడ్డుకొనేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది సంతోశ్కుమార్ ప్రతివాదన చేస్తూ, లారీ అసోసియేషన్ అనుమతి లేకుండా వ్యక్తిగత హోదాలో అసోసియేషన్ పేరుతో రిట్ దాఖలు చేశారని చెప్పారు. రిట్ పిటిషన్ను కొట్టేయాలని కోరారు. హైకోర్టు స్పం దిస్తూ బుధవారం తొలి కేసుగా విచారణ జరుగుతున్నదని స్పష్టం చేసింది.