న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: బీజేపీ జాతీయ అధ్యక్షునిగా జేపీ నడ్డా పదవీకాలం పొడిగించే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 2020లో అమిత్షా నుంచి నడ్డా పార్టీ పగ్గాలు స్వీకరించారు. 2024 ఏప్రిల్-మే నెలల్లో లోక్సభ ఎన్నికలు జరుగునున్నాయి. ఈలోగా పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలూ జరుగనున్నాయి. నడ్డా పదవీకాలం 2023 జనవరి 20తో ముగుస్తుంది. 2019లో ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఏకగ్రీవ ఎన్నికతో పూర్తిస్థాయి పార్టీ అధ్యక్షుడయ్యారు. రాబోయే ఎన్నికల పరంపర దృష్ట్యా ఆయనను కొనసాగించే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తున్నది.