స్టేషన్ ఘన్పూర్: బీజేపీ వాడిపోయిన పువ్వు అని, కాంగ్రెస్ పార్టీ విరిగిన చేయిలాంటిదని, వీటివల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీలేదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం విశ్వనాథపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. ఆ పార్టీలవాళ్లు గ్రామాల్లో సీఎం కేసీఆర్ను గానీ, తెలంగాణ ప్రభుత్వాన్ని గానీ విమర్శిస్తే అక్కడే నిలదీయాలని రైతులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు అండగా ఉంటున్న కేసీఆర్ను ప్రతిఒక్కరూ నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరారు.