నిజామాబాద్ క్రైం, అక్టోబర్ 12 : లంచం తీసుకుంటూ నిజామాబాద్ సౌత్ తహసీల్ కార్యాలయ ఆర్ఐ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి డీఎస్పీ ఆనంద్కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజామాబాద్లోని కుమార్గల్లీ ప్రాంతానికి చెందిన బంటు రామరాజు అనే వ్యక్తికి సంబంధించిన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మీసాల రాజు రూ.8 వేలు లంచం డిమాండ్ చేశాడు.
ఒప్పందం మేరకు బంటు రామరాజు గురువారం డబ్బులు తీసుకొని సౌత్ తహసీల్ కార్యాలయానికి వచ్చారు. రామరాజు నుంచి ఆర్ఐ రాజు రూ.8 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అక్కడే ఉన్న ప్రైవేటు వ్యక్తి హరీశ్కుమార్ సైతం ఆర్ఐకి సహకరించినట్టు డీఎస్పీ తెలిపారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకొని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు ఆయన పేర్కొన్నారు.