హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను నిజామాబాద్ జిల్లా రీజినల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ సిబ్బంది అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గణపతి అనే ప్రధాన నిందితుడు ఆంధ్ర – ఒరిస్సా సరిహద్దు ప్రాంతం నుంచి కిలో గంజాయిని రూ.9 వేలకు కొని, జుక్కల్ మాజీ సర్పంచ్ పవార్ రామారావు (48) అతడి కుమారుడు పవార్ శ్రావణ్(30), రంగారెడ్డి జిల్లా కాంగ్తికి చెందిన ముల్గె బాబు (55)తో కలిసి గ్రామంలో రూ.15 వేలకు విక్రయించేలా ఒప్పందం చేసుకున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం పవార్ శ్రావణ్, బాబుతో కలిసి రూ.11 లక్షల విలువైన 22 కిలోల 5 ప్యాకెట్లను తరలిస్తుండగా అప్పటికే నిఘా ఉంచిన పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు.