హైదరాబాద్ : నిజాం కాలేజీకి అనుబంధంగా నూతనంగా నిర్మించిన హాస్టల్ను పీజీ విద్యార్థులకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ హాస్టల్ను తమకే కేటాయించాలని యూజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సమస్యను పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కేటీఆర్ సూచించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓయూ వీసీ రవీందర్ యాదవ్, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్తో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఈ మేరకు కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనంలో 50 శాతం సీట్లను యూజీ విద్యార్థినులకు, మరో 50 శాతం సీట్లను పీజీ విద్యార్థినులకు కేటాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని నిజాం కాలేజీ ప్రిన్సిపల్ను ఆదేశించారు.