హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): శాసనసభలో ప్రజాసమస్యలు, ఎన్నికల హామీల అమలుపై నిలదీస్తే సమాధానం చెప్పలేమన్న భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. శాసనసభ వ్యవహారాలు ముగిసే వరకు ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేయడం అత్యంత గర్హనీయమని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సభలో ప్రజాసమస్యలపై చర్చ జరుగకుండా ప్రభుత్వం డైవర్షన్ గేమ్ ఆడిందని విమర్శించారు. ప్రజాప్రతినిధులను శాసనసభకు రానివ్వకుండా అడ్డుకున్నంత మాత్రాన ప్రజాగొంతుకను నొకలేరని, ప్రజాక్షేత్రంలోనే ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడ్తామని హెచ్చరించారు.