హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ డివిజన్లోని ఘట్కేసర్-కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీని మొత్తం అంచనా వ్యయం రూ. 2,419 కోట్లు. తెలంగాణలోని ముఖ్యమైన, అత్యధికంగా వినియోగించే కారిడార్లలో ఒకటైన ఈ మార్గంలో రైలు సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు.
ఈ ప్రాజెక్ట్ మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్ జిల్లాలను కలుపుతుంది. కాగా, దేశవ్యాప్తంగా రూ.20 వేల కోట్లతో మొత్తం 8 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇవి తొమ్మిది రాష్ర్టాల్లో 20 జిల్లాలను కలుపుతాయి.