షాద్నగర్, ఆగస్టు 20: తూర్పు లద్ధాఖ్లోని ఖేరి సమీపంలో శనివారం జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడి 9 మంది మరణించగా అందులో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తిరుమలదేవునిపల్లికి చెందిన నీరటి చంద్రశేఖర్ ఉన్నారు.
నీరటి మల్లయ్య, శివమ్మ దం పతులకు ముగ్గురు సంతానంలో చంద్రశేఖర్ చిన్నవారు. ఆర్మీలో జవాన్గా దేశానికి సేవ చేస్తూ శనివారం నాటి ప్రమా దంలో ప్రాణాలు వదిలారు. మృతదేహం సోమవారం ఉదయం గ్రామానికి చేరుకునే అవకాశం ఉన్నది.