Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నిజాం వైద్య విజ్ఞానసంస్థలో ఉదయం 8 గంటలకు హాస్పిటల్ ఆవరణలో బీరప్పతో పాటు వైద్యబృందం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కు అందరు పాటుపడాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి తమవంతు బాధ్యత నిర్వహించాలన్నారు. ప్లాస్టిక్ నిషేధంపై ఎంపీ సంతోష్కుమార్ పిలుపు మేరకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపీ సంతోష్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్, మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ, ఎక్జిక్యూటివ్ రిజిస్ట్రార్ శాంతివీర్, పీఆర్ఓ సత్యగౌడ్, ఆర్ఎంఓలు, విద్యార్థులు పాల్గొన్నారు.