హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వరంగల్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో శనివారం ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత జూన్లో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా చర్లలో లభించిన మావోయిస్టు డంపు, పేలుడు పదార్థాలు, డ్రోన్ల కేసుపై ఒకేరోజు తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లోని ఎనిమిది చోట్ల సోదాలు జరిపారు.
వరంగల్ జిల్లాలో 5 చోట్ల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 చోట్ల, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో జరిపిన సోదాల్లో పలు డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. గత జూన్లో చర్ల మండలానికి చెందిన ముగ్గురి నుంచి పేలుడు పదార్థాలు, డ్రోన్లు, లాత్ మిషన్ను స్వాధీనం చేసుకొని 12 మందిపై కేసులు నమోదు చేశారు.