హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయాన్ని ఫిబ్రవరి 17న ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆయన జన్మదినమైన ఫిబ్రవరి 17న ప్రారంభిస్తారని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నూతన సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరిట నామకరణం చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, ప్రపంచస్థాయి ప్రమాణాలు పాటిస్తూ కొత్త సచివాలయాన్ని డిజైన్ చేశారు. సచివాలయానికి వచ్చే వివిధ రాష్ట్రాల, విదేశాల ప్రతినిధులకు ల్యాండ్ మార్క్ భవనంగా నిలిచే విధంగా దీనిని నిర్మించారు.
రాబోయే 30-40 సంవత్సరాల అవసరాలకు సరిపడే విధంగా భవనాన్ని తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి చాంబర్, సీఎంవో అధికారులు, క్యాబినెట్ సమావేశం నిర్వహించేందుకు సమావేశ మందిరం ఆరో ఫ్లోర్లో ఏర్పాటుచేశారు. ఆయా శాఖల మంత్రులు, ఆ శాఖల సిబ్బంది అంతా ఒకే దగ్గర ఉండే విధంగా ఏర్పాట్లుచేశారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పించారు. సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల కార్యాలయాలను ఒకటి, రెండో అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. 2019 జూన్ 27న నూతన సచివాలయ పనులకు సీఎం శంకుస్థాపన, భూమి పూజ చేశారు. మొత్తం 28 ఎకరాలలో రూ.617 కోట్లతో సచివాలయ నిర్మాణం చేపట్టారు. ప్రధాన భవనాన్ని ఆరు అంతస్తులుగా 7.88 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు.
10 రోజుల్లో అన్ని పనులు పూర్తి: మంత్రి వేముల
నూతన సెక్రటేరియట్ నిర్మాణ తుది దశ పనులను వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణం అంతా కలియ తిరిగి అకడే అధికారులు, వర్స్ ఏజన్సీతో సమీక్ష నిర్వహించారు. ప్రధాన ద్వారం, పోర్టికో, అంతర్గత రోడ్లు, ఫౌంటెయిన్ల నిర్మాణం, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సీఎం బ్లాక్ అయిన 6వ ఫ్లోర్ వరకు గల కారిడార్లు, మంత్రుల చాంబర్స్, వర్ స్టేషన్లకు సంబంధించిన అన్ని రకాల పనులపై బ్లాకుల వారిగా క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గ్రానైట్ ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, ఫాల్స్ సీలింగ్, జీఆర్సీ పనులు, లిఫ్ట్ల పనులు, కోర్ట్ యార్డ్ ల్యాండ్ సేప్ పనులు, సీవరేజ్ పనుల పురోగతిపై చర్చించారు. తుదిదశ పనులు శరవేగంగా పూర్తి కావాలని, సరిపడా మ్యాన్ పవర్ పెంచి 10 రోజుల్లో బ్లాకుల వారీగా అన్ని రకాల పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులకు, వర్ ఏజెన్సీకి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ శశిధర్, శ్రీనివాస్, పలువురు ఆర్ అండ్ బీ అధికారులు, షాపూర్జీ పల్లోంజి నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.