హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఈ నెల 30న ప్రారంభంకానున్నాయి. ఏడాది పాటు ఈ వేడుకలు నిర్వహిస్తామని వర్సిటీ వీసీ నర్సింహారెడ్డి తెలిపారు. ఈ నెల 3న జరిగే వేడుకలకు గవర్నర్ హాజరవుతారని చెప్పారు.
నవంబరులో 10వ స్నాతకోత్సవం జరుగుతుందని, వర్సిటీ ప్రారంభమై 50 ఏళ్లు గడిచిన సందర్భంగా కొత్త కోర్సులు కూడా ప్రారంభిస్తున్నామని వీసీ వెల్లడించారు. ఈ ఏడాదే కొత్తగా 7 కోర్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఈ కోర్సుల వల్ల మరింత మంది విద్యార్థులకు మేలు జరుగుతుందని, కొత్త కెరీర్లు ఎంచుకునే అవకాశం దొరుకుతుందని పేర్కొన్నారు.