న్యూఢిల్లీ: దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేజర్ శ్యామ్సంగ్ తన 5జీ మోడల్ ఫోన్ ఎస్20 ఎఫ్ఈ గెలాక్సీ ఫోన్ను మంగళవారం ఆవిష్కరించనున్నది. ఈ సంగతి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం ద్వారా ధ్రువీకరించింది. శ్యామ్సంగ్ వెబ్సైట్లోనూ.. నోటిఫై మీ.. బటన్ నొక్కాలని పేర్కొంది.
గతేడాది సెప్టెంబర్లో అమెరికా మార్కెట్లో శ్యామ్సంగ్ తన ఎస్20 ఎఫ్ఈ మోడల్ 4జీ, 5జీ వేరియంట్లను ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో కేవలం 4జీ వేరియంట్ను మాత్రమే ప్రవేశపెట్టింది. కానీ శ్యామ్సంగ్ తన 5జీ వేరియంట్ ఎస్20 ఎఫ్ఈ ఫోన్ను తాజాగా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో ఆవిష్కరిస్తున్నది.
శ్యామ్సంగ్ తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా ఎస్20 ఎఫ్ఈ 5జీ వేరియంట్ ఫోన్ను మంగళవారం ఆవిష్కరించడంతోపాటు అదే రోజు నుంచి సేల్స్ ప్రారంభిస్తామని తెలిపింది. 5జీ వేరియంట్ ఫోన్ కొనుగోలు చేయడానికి ఆసక్తి గల వారంతా శ్యామ్సంగ్ వెబ్సైట్లో తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. ఫోన్ ఆవిష్కరించగానే వారికి నోటిఫికేషన్ వస్తుంది.
శ్యామ్సంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ వేరియంట్ ఫోన్ అమెరికాలో 699 డాలర్లకు వినియోగదారులకు అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో సుమారుగా రూ.51,400 పలుకుతుందని భావిస్తున్నారు.
శ్యామ్సంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ వేరియంట్ ఫోన్ ఓక్టాకోర్ స్నాప్డ్రాగన్ 856 ఎస్వోసీతో రూపుదిద్దుకున్నది. డ్యూయల్ సిమ్ ఫెసిలిటీతోపాటు ఆండ్రాయిడ్ 11, శ్యామ్సంగ్ వన్ యూఐ 3.0 వర్షన్తో అందుబాటులో ఉంటుంది. 6.5 అంగుళాల హెచ్డీ అమోల్డ్ ఇనిఫిటీ ఓ డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది.
ట్రిపుల్ రేర్ కెమెరా కలిగి ఉంటుంది శ్యామ్సంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ ఫోన్. ఎఫ్/1.8 వైడ్ యాంగిల్ లెన్స్తో 12-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా ఉంటుంది. మీరు 12-మెగా పిక్సెల్ అల్ర్టా వైడ్ యాంగిల్ షూటర్ విత్ ఎఫ్/2.2 అపెర్చూర్, 128 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 8-మెగా పిక్సెల్ టెలిఫొటో షూటర్ విత్ ఎఫ్/2.0 అపెర్చూర్ కెమెరాలు ఉంటాయి. ఆటో ఫోకస్ సపోర్ట్తో సెల్ఫీలు, వీడియో చాట్లకు 32-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఎఫ్/2.0 లెన్స్ కెమెరా ఉంటుంది.
శ్యామ్సంగ్ ఎస్20 ఎఫ్ఈ 5జీ వేరియంట్ ఫోన్లో వై-ఫై, బ్లూటూత్ 5.0 వర్షన్, జీపీఎస్/ ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, అస్సెలెరోమీటర్, కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, జీరో సెన్సార్, హాల్ సెన్సార్, లైట్ సెన్సార్ తదితర ఫీచర్లు జత చేశారు.
శ్యామ్సంగ్ ఎస్20 ఎఫ్ఈ 5జీ వేరియంట్ ఫోన్లో 4,500 ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంది. 15వాట్ల ఫాస్ట్ వైర్డ్ అండ్ వైర్లెస్ చార్జింగ్కు సపోర్ట్గా ఉంటుంది. ఈ ఫోన్ శ్యామ్సంగ్ పవర్షేర్కు మద్దతుగా ఉంటుంది.
ఎస్యూవీలకు ఫుల్ క్రేజీ.. ధరలు కూడా ఎక్కువే..
ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. వృద్ధులకూ హోంలోన్ ఈజీ..
ఇల్లు కొనే వారికి అద్భుత అవకాశం.. సీఎల్ఎస్ఎస్ సబ్సిడీలివే..!
క్రిప్టో కరెన్సీపై నిషేధం వద్దు : కేంద్రానికి ఇద్దరు పారిశ్రామికవేత్తల వినతి
ఈక్వలైజేషన్ లెవీతో భారత్ తల గోక్కోవడమేనా!