దేశీయంగా సేవలందిస్తున్న విదేశీ డిజిటల్ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం ‘ఈక్వలైజేషన్ లెవీ’ పేరిట పన్ను వసూలు చేస్తున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా వాణిజ్యపరమైన చర్యల దిశగా అమెరికా సాగుతున్నది. అమెరికా వాణిజ్య శాఖ ఈ మేరకు సిద్ధం చేసిన ప్రతిపాదనలపై ప్రజల అభిప్రాయాలను కోరింది. మనదేశంతోపాటు టర్కీ, ఇటలీ, బ్రిటన్, స్పెయిన్, ఆస్ట్రియా తదితర దేశాలపై ఈ చర్యలు తీసుకోవాలని అమెరికా నిర్ణయానికి వచ్చింది.
డిజిటల్ పన్నుపై విస్తృత చర్చకు అమెరికా రెడీ
తమ వాణిజ్య భాగస్వామ్య దేశాలతో డిజిటల్ పన్ను వసూలు చేసే అంశంపై విస్తృత చర్చలకు సిద్ధమని అమెరికా వాణిజ్యశాఖ ప్రతినిధి కేథరీన్ టాయ్ వెల్లడించారు. అయితే, అంతర్జాతీయంగా దీనికి ఓ పరిష్కారం లభించే వరకు సెక్షన్ 301 ప్రకారం తమకు గల ఇతర ప్రత్యామ్నాయాలను వినియోగించుకుంటామన్నారు.
ఈ భారత్ ఉత్పత్తులపై 25% అదనపు సుంకం
భారత్ విధిస్తున్న ‘ఈక్వలైజేషన్ లెవీ’కి పోటీగా అమెరికా దిగుమతి చేసుకునే సీ ఫుడ్, వెదురు ఉత్పత్తులు, రత్నాలు, ఫర్నిచర్, కోర్క్, సిగరెట్ పేపర్లపై ప్రస్తుతం వసూలు చేస్తున్న దిగుమతి సుంకానికి అదనంగా 25 శాతం ‘యాడ్ వాలరెమ్ టారిఫ్’విధించనున్నట్లు సమాచారం. భారత్ ఈక్వలైజేషన్ లెవీ పేరిట వసూలు చేస్తున్న మొత్తాన్ని తాజా అదనపు సుంకాల ద్వారా సేకరించాలని అమెరికా యోచిస్తున్నట్లు తెలిసింది.
ఏడాదిలో భారత్ సుంకం ఆదాయం 55 బిలియన్ల డాలర్లు
ప్రభుత్వ ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక ఏడాదిలో ఈక్వలైజేషన్ లెవీ కింద భారత్ 55 మిలియన్ డాలర్లు వసూలు చేస్తున్నట్లు అమెరికా వాణిజ్యశాఖ అధికారులు నిర్ధారించారు. ఇది తమ సంస్థలకు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న చర్య అని అమెరికా వాదిస్తున్నది.
2017లో ఇలా ఈక్వలైజేషన్ లెవీ వర్తింపు
భారత్లో సేవలందిస్తున్న డిజిటల్ విదేశీ సంస్థలు వాణిజ్య ప్రకటనల రూపేణా భారీగా ఆర్జిస్తున్నాయి. ఒక ఏడాదిలో ఈ సంస్థలకు రూ. లక్ష విలువ దాటిన వాణిజ్య ప్రకటనలపై భారత ప్రభుత్వం 2016-17లో ‘ఈక్వలైజేషన్ లెవీ’ పేరిట పన్ను విధించింది.
ఈ-కామర్స్తో దెబ్బతిన్న చిరు వ్యాపారులు
దీని ప్రకారం ఆయా సంస్థలకు ఇచ్చే వాణిజ్య ప్రకటనల విలువపై ఆరు శాతం పన్ను తగ్గించి వినియోగదారుడే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ‘ఈ-కామర్స్’ సంస్థలు భారత్లో క్రమంగా వేళ్లూనుకుని చిరు వ్యాపారుల బిజినెస్ను దెబ్బ తీయడంతో దేశీయ వర్తకుల నుంచి వచ్చే పన్నులు తగ్గాయి.
ఈ- కామర్స్ బిజినెస్పై రెండుశాతం పన్ను
చిరు వ్యాపారుల నుంచి వచ్చే పన్నుల ఆదాయం తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం ‘ఈ-కామర్స్’ వ్యాపార విలువ ఆధారంగా పన్ను విధించింది. రూ. 2 కోట్లకు పైగా వ్యాపారం చేసే సంస్థలపై గతేడాది ఏప్రిల్ నుంచి 2 శాతం పన్ను విధించింది.
భారత్ చర్య వివక్షాపూరితం అన్న అమెరికా
భారత్ చర్య పూర్తిగా వివక్షాపూరితమైన వాణిజ్య ప్రక్రియ అని అభివర్ణించింది అమెరికా. ఇలా డిజిటల్ పన్ను విధిస్తున్న దేశాలపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ దర్యాప్తు భారత్ విధిస్తున్న ఈక్వలైజేషన్ పన్ను వివక్షాపూరితమైందేనని తేల్చింది. దీన్ని భారత్ కొట్టిపారేసింది. నిబంధనలకు అనుగుణంగానే పన్ను వసూలు చేస్తున్నామని స్పష్టం చేసింది.
పీఎంసీ బ్యాంకులో జూన్ వరకూ ఆంక్షలు.. ఎందుకంటే..
చౌకగా ఇచ్చే వారివద్దే చమురు కొనుగోలు!
స్క్రాపేజీ పాలసీ అమలు కష్టమే.. మారుతి ఈడీ శ్రీవాత్సవ
రిలయన్స్-ఆరామ్కో డీల్ మరింత జాప్యం.. ఎందుకంటే!
ఉదయనిధిపై గెలుస్తా.. పీఎంకే అభ్యర్థి ధీమా
బెంగాల్ పోరు : బీజేపీ నేత సువేందు అధికారి సోదరుడి వాహనం ధ్వంసం!