ఆమోదించిన రాష్ట్ర వన్యప్రాణి మండలి
నెహ్రూ జూపార్క్ను దేశంలోనే నంబర్ 1గా చేస్తాం: ఇంద్రకరణ్రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 24 : అభయారణ్యాల్లో రహదారులతో పాటు వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అండర్పాస్ లు ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధ్యక్షతన గురువారం వర్చువల్గా జరిగిన వన్యప్రాణి మండలి సమావేశంలో అభయారణ్యాల్లో రహదారులు, అండర్పాస్ల నిర్మాణం, వేగ నియంత్రణ, రాత్రివేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం, అఖిల భారత పులుల గణన వంటి అంశాలపై చర్చించారు. మండలి నిర్ణయాలకు కేంద్ర వన్యప్రాణి మండలి నుంచి త్వరగా అనుమతులు వచ్చేలా కృషిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
నెహ్రూ జులాజికల్ పార్లో ఆన్లైన్ సేవలు
జీవ వైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్గా ఉన్న హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పారును దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దుతామని, మరికొన్ని జంతువులను తీసుకొస్తామని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. గురువారం నిర్వహించిన జాపాట్ (జూ అండ్ పార్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ) కార్యవర్గ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ పార్కుల్లో వన్యప్రాణుల సంరక్షణ, అభివృద్ధి, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 109 అర్బన్ ఫారెస్టు పార్కులు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం కాగా ఇప్పటికే 37 ప్రారంభమయ్యాయని, మరో 16 పార్కుల పనులు పూర్తయ్యాయని వివరించారు. నెహ్రూ జూపారు కోసం వెబ్సైట్ను రూపొందించి, టికెట్ బుకింగ్, విరాళాలు, వన్యప్రాణుల దత్తత వంటి ఆన్లైన్ సేవలను అందిస్తామని పీసీసీఎఫ్ ఆర్ శోభ తెలిపారు.