హైదరాబాద్ : తెలంగాణలోని జూ పార్కులు, జింకల పార్కులు, జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ మేరకు ఆయా కేంద్రాల పున:ప్రారంభానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగరంలోని నెహ్రు జూపార్క్ ఆదివారం నుంచి తెరుచుకోనుంది. కాగా పులుల అభయారణ్యాలు మాత్రం పునరుత్పత్తి సీజన్ తర్వాతే పున:ప్రారంభం కానున్నాయి. అన్ని ప్రాంతాల్లో తగిన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సందర్శకులకు అనుమతి ఇవ్వాలని పీసీసీఎఫ్ ఆర్. శోభ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.