హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పోలీసింగ్ పట్టు తప్పిందా..? క్రైం రేట్ అంతకంతకూ పెరుగుతున్నా పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం వీడటం లేదా?.. అంటే రోజురోజుకూ అదుపుతప్పుతున్న శాంతిభద్రతలను చూస్తే.. అవుననే సమాధానం వినిపిస్తున్నది. పోలీస్ సిబ్బందిలో బాధ్యత, జవాబుదారీతనం కొరవడి దుండగులు పెట్రేగిపోతున్నారు. ప్రజా రక్షణను గాలికొదిలేసి, కొందరు అధికారులు వ్యక్తిగత లాభాల కోసం పాకులాడుతుండటంతో సామాన్యుడు పోలీస్ స్టేషన్ మెట్లెకాలంటేనే భయపడే దుస్థితి దాపురించింది. సెటిల్మెంట్ల అడ్డాగా పోలీస్స్టేషన్లు శాంతిభద్రతలను కాపాడాల్సిన కొందరు అధికారులు సివిల్ వివాదాలు, భూ తగాదాల్లో తలదూరుస్తూ రూ.కోట్లలో సెటిల్మెంట్లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల డీజీపీ ఆఫీస్ కేంద్రంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సైతం డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దని ఆదేశించారు.
నీరుగారిపోతున్న పోక్సో కేసులు..
నిర్భయ, పోక్సో చట్టాలను అమలు చేయడంలో పోలీసుశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిందితులు సులువుగా బెయిల్పై బయటకు వస్తున్నారు. షాబాద్ పోక్సో కేసులోనూ పోలీసుల నిర్లక్ష్యమే ఆరుగురి ప్రాణాలను బలితీసుకున్నదని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులోనూ తాజాగా హైకోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇలాంటి హైప్రొఫైల్ కేసుల్లో సైతం నిందితులకు లీగల్ లూప్ హోల్స్ దొరకడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్టేషన్ల వారీగా క్రైమ్ రివ్యూలు ఏవీ?
కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ వచ్చిన తర్వాత ప్రతినెలా క్రైమ్ రివ్యూలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చినా కూడా వాటిని పట్టించుకోవడంలేదు. హోం శాఖను సీఎం చూస్తున్నా ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకోవడం పోలీస్ శాఖ పనితీరును వేలెత్తి చూపిస్తున్నాయి. అవినీతి కేసుల్లో రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ తర్వాత మూడోస్థానంలో పోలీసుశాఖ నిలిచింది.
సంవత్సరం కేసుల నమోదు అధికారుల అరెస్ట్