హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): నీట్ యూజీ 2023ని వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్ఎంస్, బీఏఎంఎస్ తదితర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం వచ్చే నెల 7న నీట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే సుమారు 21 లక్షల దరఖాస్తులు నమోదయ్యాయి.
పరీక్షకు మరో మూడు వారాల సమయమే మిగిలి ఉండగా, నీట్ను వాయిదా వేయాలంటూ సోషల్ మీడియాలో విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి విజ్ఞప్తి చేస్తున్నారు. కొవిడ్, ఇతర కారణాల వల్ల అనేక రాష్ర్టాల్లో ఇంటర్ విద్యా సంవత్సరాలు ఆలస్యంగా ముగిశాయి. ప్రిపేర్ కావడానికి తమకు సమయం దొరకడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. నిరుడు సెప్టెంబర్లో పరీక్ష జరిపిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. దేశవ్యాప్తంగా 499 నగరాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికిప్పుడు పరీక్షను వాయి దా వేయడం కష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు.