హైదరాబాద్, జూన్ 19(నమస్తే తెలంగాణ): నీట్ పీజీ- 2023 అడ్మిషన్లో ఎస్సీ, ఓబీసీ వర్గాలకు చెందిన.. చిట్టచివరిగా ప్రవేశం పొందిన అభ్యర్థికి వచ్చిన మారులు, ర్యాం కుల వివరాలు నివేదించాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)ను హైకోర్టును ఆదేశించింది. ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసినా అమలు కాలేదంటూ జాతీయ మెడకల్ కమిషన్ జారీచేసిన నీట్ పీజీ మెడికల్లో ఆ ప్రస్తావన లేదంటూ హైదరాబాద్కు చెందిన కొయ్యల రూత్ జాన్పాల్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఎన్ఎంసీ న్యాయవాది పూజిత వాదిస్తూ, పిటిషనర్ ఎస్సీ రిజర్వేషన్ల కోటా కోరారని, తర్వాత థర్డ్జండర్ కోటా ఎంచుకోవటం చట్ట వ్యతిరేకమని చెప్పారు.