ఖలీల్వాడి, మార్చి 20: నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్డీసీసీబీ) చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి బుధవారం రాజీనామా చేశారు. పదవీకాలం మరో ఏడాది ఉండగానే ఆయన స్వచ్ఛందంగా తప్పుకొన్నారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సహకార బ్యాంకు కమిషనర్కు అందజేశారు. పదవుల కోసం పార్టీలు మారుతున్న ప్రస్తుత తరుణంలో.. పార్టీ కోసం భాస్కర్రెడ్డి తన పదవిని వదులుకున్నారని బీఆర్ఎస్ నేతలు ప్రశంసిస్తున్నారు.