హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సెలూన్ల ఆధునికీకరణకు ఆర్థికసాయం అందించేందుకు మంత్రి కేటీఆర్ సుముఖత వ్యక్తం చేశారని తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సేవా సంఘం నేతలు హర్షం ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
శనివారం యాదగిరిగుట్టకు పాదయాత్రగా వెళ్లి నృసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యక్షేత్రం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు నాయీ బ్రాహ్మణ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు వేముల సత్యనారాయణ, భిక్షం, శివ, పయ్యావుల కృష్ణ, జంపాల శ్రీనివాస్, రాజు, నరసింహ, మురళి, శ్రీకాంత్ పాల్గొన్నారు.