మహబూబ్నగర్ : నవాబ్పేట టీఆర్ఎస్ ఎంపీటీసీ భోగం రాధాకృష్ణ(38) మృతి చెందాడు. దీంతో నవాబ్పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాధాకృష్ణ మృతిపట్ల టీఆర్ఎస్ నాయకులు సంతాపం ప్రకటించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంగళవరాం అర్ధరాత్రి సమయంలో ఎంపీటీసీ రాధాకృష్ణ మహబూబ్నగర్ పట్టణం నుంచి నవాబ్పేటకు వెళ్తుండగా.. గద్దగుండు వద్ద ఆయన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఎంపీటీసీకి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో ఎవరూ గమనించలేకపోయారు. ఇవాళ ఉదయం అటువైపు వెళ్లిన వాహనదారులు.. ప్రమాదానికి గురైన కారును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు.