హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): పెన్షనర్లపై కేంద్రం తీరును నిరసిస్తూ ఈ నెల 18న దేశవ్యాప్తంగా కోల్మైన్స్ పీఎఫ్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని ఆలిండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ కన్వీనర్ పీకే సింగ్ వెల్లడించారు. గురువారం హైదరాబాద్లోని మూసారాంబాగ్లో ఆల్ కోల్ పెన్షనర్ల సమావేశం జరిగింది. దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పీకే సింగ్ మాట్లాడుతూ, త్వరలోనే కోల్మైన్స్ ప్రాంతాల సీఎంలు, కేంద్ర మంత్రులను కలుస్తామని, కేంద్రం స్పందించకుంటే జూలై 25న ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద భారీ నిరసన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దండంరాజు రాంచందర్రావు, నాయకులు ఆళవందార్ వేణుమాధవ్, పీ సంపత్కుమార్, కే సత్యనారాయణ, నర్సింగ్రావు, జేవీ దత్తాత్రేయులు, ఏఆర్సీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.