హైదరాబాద్, మార్చి 12 : జాతీయ స్థాయిలో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్కు భారీ స్పందన వచ్చింది. దీనిలో తెలంగాణలోని వివిధ కోర్టుల్లో నిర్వహించిన లోక్ అదాలత్లలో 3,02,768 కేసులు పరిషారమయ్యాయి. వీటిలో పెండింగ్ కేసులు 2,83,007, ప్రీ-లిటిగేషన్ కేసులు 19,761 ఉన్నాయి. ఈ కేసుల పరిష్కారంతో బాధితులకు రూ.116.33 కోట్ల పరిహారం లభించినట్టు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి ఎస్ గోవర్దన్రెడ్డి ప్రకటించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ నాయకత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ పీ నవీన్ రాష్ట్రంలో లోక్ అదాలత్లను పర్యవేక్షించారని తెలిపారు.