చండీగఢ్, సెప్టెంబర్ 2: రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 22న దేశ వ్యాప్త ఆందోళన నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) శనివారం పిలుపునిచ్చింది. ఇటీవల ముంచెత్తిన వరదల కారణంగా నష్టపోయిన పంజాబ్, హిమాచల్ప్రదేశ్తోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల రైతులందరికీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల వద్ద నిరసన చేపట్టాలని ఎస్కేఎం నేత జంగ్వీర్ సింగ్ చౌహాన్ కోరారు. ఈ నిరసన కార్యక్రమం మధ్యాహ్నం 12 నుంచి నాలుగు గంటల పాటు కొనసాగించాలన్నారు. వరదల కారణంగా పంట నష్టపోయిన చాలా ప్రాంతాలలో ఇంతవరకు సర్వే నిర్వహించలేదని ఆయన మండిపడ్డారు. అలాగే పంట నష్టపోయిన వారికి తగిన పరిహారం చెల్లించాలంటూ ఈ నెల 11 నుంచి 13 వరకు కేంద్ర మంత్రులు, ఆప్ మంత్రులు, బీజేపీ నేతల ఇళ్ల ముందు ఎస్కేఎం ఆధ్వర్యంలో నిరసన తెలుపుతామని ఆయన చెప్పారు.