హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): జీవవైవిధ్య పరిరక్షణకు పాటుపడేలా యువ పరిశోధకులు, శాస్త్రవేత్తలు కృషి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కో రారు. పరిశోధకులు, శాస్త్రవేత్తలు తమ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రభావవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తుండటం అభినందనీయమని కొనియాడారు. హైదరాబాద్ మా దాపూర్లో శుక్రవారం జులాజికల్ సర్వే ఆఫ్ ఇండి యా (జెడ్ఎస్ఐ), నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్బీఎఫ్జీఆర్) నిర్వహిస్తున్న జాతీయస్థాయి వర్షాప్ ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించిన కవ్వాల్ టైగర్ రిజర్వ్ జంతుజాలం, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ జంతుజాలం పుస్తకాలను మంత్రి ఆవిషరించి, పలువురికి సర్టిఫికెట్లు, బహుమతులను అం దజేశారు. ‘అడ్వాన్సెస్ ఇన్ ఫిష్ సిస్టమాటిక్స్-మార్ఫోలాజికల్, మాలిక్యులర్ అప్రోచెస్’ అంశంపై ప్రసంగించారు.