హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్లో జాతీయ జెండాను బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, పార్లమెంటరీ పార్టీ నాయకులు కే కేశవరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కే కేశవరావు మాట్లాడుతూ సెప్టెంబర్ 17 పై కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎం శ్రీనివాస్రెడ్డి, పర్యాద కృష్ణమూర్తి, నేరేళ్ల ఆంజనేయులు, కట్టెల శ్రీనివాస్యాదవ్, ప్రేమ్సింగ్ రాథోడ్, రూప్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
శాసనమండలి కార్యాలయంలో చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభా కార్యాలయ ఆవరణలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రవీందర్రావు, విఠల్, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, ఎం రమేశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో జాతీ య సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు డాక్టర్ మంద జగన్నాథం, కేఎం సాహ్ని హాజరయ్యారు. బీఆర్ అంబేదర్, తెలంగాణ తల్లి విగ్రహం, అమరవీరుల స్థూ పానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మందా జగన్నాథం జాతీయ పతాకాన్ని ఆవిషరించారు. కార్యక్రమంలో తెలంగాణ భ వన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఓఎస్డీ సంజయ్ జాజు పాల్గొన్నారు.