హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ) : 2023-24 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలో 1,395 మంది గిరిజన విద్యార్థులకు నేషనల్ స్కాలర్షిప్లను, మరో 218 విద్యార్థులకు ఎస్టీ ఫెలోషిప్లను అందజేసినట్టు కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ప్రకటించింది. ఉన్నత విద్యనభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులకు అందిస్తున్న ఫెలోషిప్లు, స్కాలర్షిప్లపై సోమవారం లోక్సభలో రాష్ట్ర ఎంపీలు గడ్డం రంజిత్రెడ్డి, వెంకటేశ్నేత బొర్లకుంట, మాలోత్ కవిత అడిగిన ప్ర శ్నకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండా లిఖితపూర్వక సమాధానామిచ్చారు. ఫెలోషిప్స్ కింద ఎంఫిల్ కోర్సుల్లోని విద్యార్థులకు రూ. 31వేలు, పీహెచ్డీ విద్యార్థులకు మొదటి రెండేండ్లు రూ. 31 వేలు, చివరి మూడేండ్లు రూ.35వేల చొప్పున ప్రోత్సాహాన్నిస్తున్నట్టు వెల్లడించారు.
వాతావరణంలోని కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకు గ్రీన్హైడ్రోజన్ వినియోగం, కార్బన్ను సే కరించడం, వినియోగించడం, నిల్వచేయడం వం టి చర్యలు చేపడుతున్నట్టు కేంద్ర అటవీ పర్యావరణ, వాతావరణ మార్పులశాఖల మంత్రి అశ్వినికుమార్ చౌబే పార్లమెంట్కు తెలిపారు. సోలార్ సహా, స్టోరేజీబ్యాటరీలు, సోలార్ థర్మల్ డివైజెస్ వినియోగాన్ని విరివిగా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. కర్బన ఉద్ఘారాల తగ్గింపు సహా పలు అంశాలపై ఎంపీ రంజిత్రెడ్డి, బొర్లకుంట వెంకటేశ్ నేత, కవిత మాలోత్ సహా పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు అశ్వినికుమార్ చౌబే సమాధానమిచ్చారు. అల్ట్రామెగా సోలార్ ఎనర్జీ పార్కుల ఏర్పాటు, పీఎం కుసుమ్, సోలార్ రూఫ్టాప్ ఫేజ్ -2 వంటి చర్యలు చేపట్టామని వివరించారు.