వికారాబాద్ : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు వజ్రోత్సవాలు నిర్వహిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్లోని ఎన్టీఆర్ చౌరస్తాలో సామూహిక గీతాలాపన కార్యక్రమంలో పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోదని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఉచితంగా జాతీయ జెండాలను అందజేసి జాతీయ ఐక్యతను సీఎం కేసీఆర్ చాటారని మంత్రి తెలిపారు.
ఈ నెల 22 వరకు నిర్వహించే వజ్రోత్సవాల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. రాష్ర్టాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి తెలపారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యలను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందని వివరించారు. కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్, ఐజీ కమలహాసన్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, లైబ్రరీ చైర్మన్ మురళీ కృష్ణ, రాష్ట్ర బీసీ కమీషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, ఎస్పీ కోటి రెడ్డి, డీఈవో రేణుక, పాల్గొన్నారు.